జాతీయ వార్తలు

వాహనాలకు మావోల నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 18: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా దబ్బాకున్నా అటవీప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్లో గాయపడి జగదల్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్ ఆదిత్యా శరణ్‌ప్రతాప్ చనిపోయాడు. అతని శరీరంలో మూడు చోట్ల బుల్లెట్లు దిగాయి. పరిస్థితి విషమించడంతో హెలీకాప్టర్‌లో జగదల్‌పూర్‌కు తరలించిన సంగతి విదితమే. చికిత్స చేసి బుల్లెట్లు తొలగించినా ఫలితం లేక ఆదిత్యా కన్నుమూశాడు. ఆదిత్యా 2008లో పోలీసు ఉద్యోగంలో చేరాడు. పలు ఎన్‌కౌంటర్లలో ఆయన పాల్గొన్నాడు. కాగా మరో వైపు మావోయిస్టులు సుక్మా జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దాటాక విరుచుకుపడ్డారు. బచేలిలోని ఎస్‌ఆర్ స్టీల్ ఇండియా కంపెనీకి చెందిన వాటర్ పంపునకు నిప్పు పెట్టారు. 20 వాహనాలను తగులబెట్టారు. కిరండోల్-బచేలి మధ్య రైలు మార్గాన్ని ధ్వంసం చేయడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరో లారీని అడ్డగించి డ్రైవర్‌ను చితకబాది అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని, డబ్బులు, ఇతర వస్తువులు లూటీ చేశాఠు.