జాతీయ వార్తలు
ఎన్కౌంటర్లో మావో కమాండర్ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 August 2016
భద్రాచలం, ఆగస్టు 16: ఛత్తీస్గఢ్, ఒడిషా సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో పేరుమోసిన మావోయిస్టు జనమిలీషియా కమాండర్ అర్జున్ హతమయ్యాడు. చందోమేటా అటవీప్రాంతంలోని కందనార్ గ్రామ శివారుల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చందోమేట జనమిలీషియా కమాండర్, మచ్కోట్ దళ సభ్యుడు అర్జున్ చనిపోయాడు. సంజీవని అంబులెన్స్ను 2014లో పేల్చివేసి జవాన్లను మట్టుబెట్టిన ఘటనలో అర్జున్ ప్రధాన నిందితుడు. కోలింగలోని మాజీ సర్పంచ్ పాండురాం నాగ్ను చంపిన ఘటనలో కూడా ఆయన పాల్గొన్నారు. తాజాగా కందనార్ గ్రామంలో పురూ అనే గ్రామస్థుడిని కూడా హత్య చేశాడు.