జాతీయ వార్తలు
ఎరియర్స్ అన్నీ ఒకేసారి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 July 2016
న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఏడో వేతన సంఘం సిఫార్సులకు సంబంధించిన ఎరియర్స్ అన్నీ కూడా ఒకేసారి ఆగస్టు వేతనాలతో కలిపి ఇవ్వాలని శనివారం నిర్ణయించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఉద్యోగులకు ఇప్పటికే 2.57రెట్లు మూలవేతనం పెరిగింది. 125శాతం డిఏ పెరిగింది. మొత్తంమీద 23.5శాతం పెరుగుదల జరిగింది. ఈ పెంపు జనవరి 1, 2016నుంచి అమల్లోకి తెస్తున్నారు. అంటే మొత్తం ఏడునెలల ఎరియర్స్ ఉద్యోగులకు ఆగస్టు జీతాలతో కలిపి రానుంది. కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనం రూ.7వేల నుంచి రూ.18వేలకు, అత్యధిక వేతనం (కేబినెట్ కార్యదర్శి స్థాయి) రూ.90వేల నుంచి 2.5లక్షలకు ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు పెరిగిన సంగతి తెలిసిందే.