జాతీయ వార్తలు
ఇక కేజ్రీవాల్ పనిపడతా: సుబ్రహ్మణ్య స్వామి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 June 2016
దిల్లీ: తన దెబ్బకు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ విరమణ అనంతరం విదేశాలకు పోతున్నాడని, ఇక దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటిబాట పట్టేందుకు తాను దృష్టి సారించానని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఎన్డిఎంఎ అధికారి హత్య కేసులో బిజెపి ఎంపీ మహేష్ గిరి హస్తం ఉందని కేజ్రీవాల్ ఆరోపించడంపై స్వామి ఆగ్రహం వ్యక్తం చేశరు. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పేంతవరకూ మహేష్ గిరితో కలిసి తాను దీక్ష విరమించేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడి ఐఐటిలో కేజ్రీవాల్ సీటు సంపాదించి చదివినట్లు తన వద్ద సాక్ష్యాధారాలున్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతానన్నారు. ‘రాజన్ పని పూర్తయ్యింది.. ఇక కేజ్రీవాల్ సంగతి తేలుస్తా..’ అని ఆయన చెప్పారు.