జాతీయ వార్తలు
రాజస్థాన్లో కూలిన మిగ్-27 విమానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 June 2016
జోధ్పూర్, జూన్ 13: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-27 విమానం రాజస్థాన్లో కూలిపోయింది. అయితే పైలెట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. జోధ్పూర్లోని మహావీర్నగర్ బహిరంగ ప్రదేశంలో ఓ ఇంటిపక్కనే విమానం కూలిపోయిందని బన్సీ పోలీసుస్టేషన్ ఎస్ఐ రాజేష్ యాదవ్ తెలిపారు. రోజువారీ శిక్షణ కార్యక్రమంలో భాగంగానే విమానం గాలిలో ఎగురుతుండగా సాంకేతిక సమస్య తలెత్తిందని అన్నారు. విషయాన్ని గమనించిన పైలెట్ విమానాన్ని సురక్షిత ప్రాంతంలో దించాలని భావించాడు. అయితే ఇంజన్ ఫెయిలైపోవడంతో ప్రమాదం జరిగిందని, పైలెట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడని వైమానిక దళ అధికారులు వెల్లడించారు. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.