జాతీయ వార్తలు
అరాచకత్వానికి ఆ ఇద్దరిదే బాధ్యత: కేజ్రీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 June 2016
దిల్లీ: దేశ రాజధానిలో అరాచకశక్తులు పెచ్చుమీరడానికి ప్రధాని మోదీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రధాన కారకులని సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో ఈమేరకు పలు పోస్టింగ్లు చేశారు. దిల్లీలో అత్యాచారాలు, విధ్వంసక సంఘటనలు జరుగుతున్నా పోలీసులపై తమకు అజమాయిషీ లేకుండా పోతోందన్నారు. ఇక్కడి పోలీసులు దిల్లీ ప్రభుత్వానికి బదులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీంతో తాను ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోందన్నారు.