జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 21: ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు. ఇద్దరు జవాన్లు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. శ్రీనగర్‌కు 81కిలోమీటర్ల దూరంలోని కుప్వారా జిల్లాలోని ద్రుగ్‌ముల్లా గ్రామంలో మిలిటెంట్ల ఉనికిని పసిగట్టిన సైనిక బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నించారు. మిలిటెంట్లు సైన్యంపై కాల్పులు జరపటంతో ఎదురుకాల్పులు తప్పలేదు. గాయపడిన ఇద్దరు జవాన్లను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారని.. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ సాగుతోందని.. ఘటనాస్థలం నుంచి ఐదు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

chitram మిలిటెంట్ల ఏరివేతలో భద్రతా బలగాలు