జాతీయ వార్తలు
మూడో రోజూ ఎమ్మార్పీఎస్ దీక్షలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 May 2016
న్యూఢిల్లీ, మే 10: ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఢిల్లీలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం మూడో రోజుకు చేరుకొన్నాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు విధానానికి కాలం చెల్లిందని అన్నారు. అందుకే దళితుల మధ్య అసమానతలు, అంతరాలు వస్తున్నాయన్న కృష్ణ మాదిగ నూతన రిజర్వేషన్లు విధానం రావాలన్నారు. దీనికోసం రాజ్యాంగ సవరణ జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, మ్యుఖ్యమంత్రి కెసిఆర్కు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృతజ్ఞతలు తెలిపింది.