జాతీయ వార్తలు

ఐఏఎస్‌లపై 29 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4:దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారులపై 29 ప్రొటోకాల్ ఉల్లంఘన ఫిర్యాదులు అందినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2018 నుంచి ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగినట్టు ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 10 సంఘటనలు జరిగాయని, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లో నాలుగేసి సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన వివరించారు. ఒడిశా, మధ్యప్రదేశ్‌లో రెండేసి సంఘటనలు, ఆంధ్రప్రదేశ్, బిహార్, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీసగఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఐఏఎస్‌లపై ప్రొటోకాల్ ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన వివరించారు.