జాతీయ వార్తలు
కశ్మీర్ ప్రశాంతం :అమిత్ షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అక్కడ ఒక్క బుల్లెట్ పేలలేదని, ఒక్క ప్రాణం కూడా పోలేదని అన్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్పై ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఓటు బ్యాంకును ఆశించకుండా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. కశ్మీర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పునరుద్ఘాటించారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం జీఎస్టీ రద్దు, వాయుదాడులు, పెద్ద నోట్ల రద్దు వంటి 50 కీలక నిర్ణయాలు తీసుకున్నదని చెప్పారు.