జాతీయ వార్తలు
బీజేపీపై మాయావతి మండిపాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 July 2019
లక్నో: బీఎస్పీ అధ్యక్షురాలి సోదరుడు, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడైన ఆనంద్కుమార్కు చెందిన రూ.400 కోట్లు విలువ చేసే ఆస్తిని జప్తుచేయటంపై మాయావతి మండిపడింది. తన కుటుంబ సభ్యులను బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించారు. బీజేపీ నాయకుల ఆస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తుజరిపించాలని డిమాండ్ చేసింది. సార్వత్రిక ఎన్నకల్లో బీజేపీ తన గెలుపు రూ.2000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించింది. తమ పార్టీ నేతలపై ఎన్నిరకాల తప్పుడు కేసులు పెట్టినా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని ఆమె స్పష్టంచేశారు. కాగా మాయావతి సోదరుడు ఆనంద్కుమార్కు చెందిన రూ.400 కోట్ల విలువ చేసే స్థలాన్ని బినామీ ఆస్తిగా పేర్కొంటూ ఐటీ అధికారుల జప్తు చేసిన విషయం విదితమే.