S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వరుణ్సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జెల హరికుమార్రెడ్డి రూపొందించిన చిత్రం మిస్టర్ 420. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. వరుణ్వందేశ్కు ఈ చిత్రం సూపర్హిట్గా నిలుస్తుందని, కథాకథనాలు విభిన్నంగా ఉంటాయని తెలిపారు.
భారతీయ మాజీ ఫాస్ట్బౌలర్ శ్రీశాంత్ కథానాయకుడుగా నిక్కీగల్రాని కథానాయికగా సురేష్ గోవింద్ దర్శకత్వంలో రాజ్ జకారియా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ..
టాలీవుడ్లో అందరూ గోల్డెన్ హ్యాండ్ అన్నారు. ఓకె అనుకుని బాలీవుడ్లోకెళితే ఐరెన్ లెగ్ అన్నారు. ఒకే వ్యక్తికి వ్యతిరేకమైన రెండు పేర్లు ఎలా వుంటాయి? అంటోంది కథానాయిక తమన్నా. విషయంలోకెళితే, టాలీవుడ్లో నెంబర్వన్ స్థానానికెదిగిన తమన్నా, ‘బాహుబలి’ హిట్ తరువాత మరింతగా స్టామినా సాధించింది. కెరీర్ పరంగా ఆమె బాట నల్లేరుపై నడకలా సాగింది. ‘ఊపిరి’ చిత్రంకూడా మరింత ఊపిరిపోసింది ఆమె కెరీర్కి.
ఆది కెరీర్లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దాదాపు 350 థియేటర్లలో విడుదలైన ఈ అబ్బాయి అందరికీ నచ్చాడు అని నటుడు సాయికుమార్ తెలిపారు. ఆది, నమితాప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్ఆర్టి మూవీస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి రూపొందించిన ‘చుట్టాలబ్బాయి’ విడుదలైన సంగతి తెలిసిందే.
మహానటి సావిత్రి గూర్చి తెలియనివారు తెలుగు ప్రేక్షకులు లేరు. కథానాయికలపై, వాంప్ పాత్రల్లో నటించిన నటీమణుల జీవితాలపై సినిమాలు వస్తున్న రోజులివి. ఆ కోవలో ప్రస్తుతం సావిత్రి జీవిత కథతో కూడా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అదే పేరుతో. డర్టీ పిక్చర్లో సిల్క్ స్మితగా విద్యాబాలన్ నటించి అనేక అవార్డులను రివార్డులను కొట్టేసింది. ఆ స్థాయిలో జీవిత కథలలో నటించే కథానాయికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?
కథానాయకుడు వరుణ్ సందేశ్ ఓ ఇంటివాడయ్యాడు. తనతోపాటు కథానాయికగా నటించిన వితికాశేరును ఆయన వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంతోనే వారిద్దరూ ప్రేమలో పడి చివరికి మూడుముళ్ళవరకూ ప్రయాణించారు.
సుశాంత్ హీరోగా నటించిన సినిమా ‘ఆటాడుకుందాం రా’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్మీట్ను శనివారం ఉదయం ఏర్పాటుచేశారు.
అభి సుబ్రహ్మణ్యం క్రియేషన్స్ పతాకంపై సుబ్బు కథానాయకుడిగా శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో శివపురం సురేందర్ కుమార్ రూపొందిస్తున్న ‘రజనీ ది డాన్’ చిత్రం దసరాకు ప్రారంభం కానుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
ఇటీవల విడుదలైన ‘చుట్టాలబ్బాయి’ చిత్రంలో కథానాయికగా నటించిన నమితా ప్రమోద్, తొలిచిత్రంతోనే మంచి నటిగా ముద్రపడింది. 2011 నుండి కెరీర్ స్టార్ట్ చేసిన నమిత, మలయాళ, తమిళ రంగాలలో తన స్టామినా నిరూపించే పాత్రలను చేసింది. సెవెంత్ స్టాండర్డ్ నుండే సీరియల్స్లో నటిస్తున్న ఈ కేరళ కుట్టి, మోహినీఆట్టం నృత్యంలో దిట్ట. కథానాయిక శరణ్యామోహన్ డాన్స్ స్కూల్లో నృత్యాన్ని అభ్యసించింది.
ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవం సందర్భంగా తెలుగు సినీ స్టిల్ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాసరి నారాయణరావు విచ్చేసి అసోసియేషన్ సభ్యులను అభినందించారు.