జాతీయ వార్తలు

అలా వ్యాఖ్యలు చేయడం సరికాదు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో పాటు మరికొందరు ఆర్థిక నిపుణులపై బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు స్పందించారు. స్వామి చేస్తున్న వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు సోమవారం ప్రస్తావించగా ప్రధాని స్పందించారు. ‘సొంత పార్టీ వారైనా, ఇతర పార్టీల వారైనా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు.. వ్యవస్థ కన్న తామే గొప్ప అని భావించడం పద్ధతి కాదు..’- అని మోదీ అన్నారు. ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ పదవీ విరమణ అనంతరం ఏ దేశంలో స్థిరపడినా అతను భారత్ క్షేమాన్ని ఆకాంక్షిస్తారని ఆయన అన్నారు. రాజన్‌కు ఇక్కడ పౌరసత్వం లేకున్నా భారత్ అంటే అతనికి ఎనలేని గౌరవమని ప్రశంసించారు. రఘురాం రాజన్‌ను ఆర్‌బిఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని స్వామి పదేపదే ప్రధానికి లేఖలు రాశారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌లపై కూడా విమర్శలు గుప్పించారు.