జాతీయ వార్తలు
రామజన్మభూమి కేసులో వాదనలు అక్టోబర్ 18కి పూర్తి:సీజేఐ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 September 2019
న్యూఢిల్లీ: గత కొనే్నళ్లుగా న్యాయస్థానంలో ఉన్న రామజన్మభూమి వివాదం కేసులో వాదనలు పూర్తయి త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ మేరకు మంగళవారంనాడు జరిగిన వాదనల సందర్భంగా జస్టిస్ గొగొయ్ మాట్లాడుతూ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు రాయడానికి తమకు కనీసం నాలుగువారాల సమయం అవసరమవుతుందని, అందువల్ల అక్టోబరు 18నాటికి వాదనలను పూర్తి చేయాలని కోరారు. విచారణతోపాటు మధ్యవర్తిత్వ ప్రక్రియ కూడా కొనసాగవచ్చునని దానిని సుప్రీంకోర్టుకు సమర్పించవచ్చునని తెలిపారు.