జాతీయ వార్తలు

బాబు క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 26: పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారంటూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందర్నీ గాయపరిచాయని, ఆయన దేవుడిపైన కూడా వ్యాఖ్యలు చేసేంత పెద్దవాడైపోయారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి గవర్నర్ తరచూ దేవాలయాలకు వెళ్తారని, దీనిపై గవర్నర్ నరసింహన్ స్పందిచాలని విహెచ్ కోరారు. అయ్యప్ప భక్తులను అవమానపరిచే విధంగా ఎపి ముఖ్యమంత్రి మాట్లాడారని విహెచ్ ఆరోపించారు. రాష్టప్రతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేవాలయాలకు వెళ్తారని, వారంతా పాపాలు చేసిన వాళ్లా ?...అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుని దేవుడే శిక్షిస్తాడని, ఆయన పాపాలు చెయ్యకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యానని, రాజ్యసభ అభ్యర్ధిత్వంపై ఆమెతో చర్చించినట్లు విహెచ్ వెల్లడించారు.