జాతీయ వార్తలు

ఢిల్లీ-విజయవాడ విమానంలో సాంకేతిక లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మే 2: ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపాల కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏం జరిగిందో వివరించకుండానే సుమారు రెండున్నర గంటలు విమానంలోనే ఉంచడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మరో విమానంలో ఈ ప్రయాణికులను విజయవాడకు తరలించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని ప్రయాణికులు అడ్డుకున్నారు. ఇంత కాలాతీతమైనా ఎవరూ పట్టించుకోలేదని, ప్రయాణికుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా కనీసం పట్టించుకోలేదంటూ తాము ఇక్కడే దిగిపోతామని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయినా ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యేక విమానంలో విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు రెండున్నర గంటలపాటు ఏమైందో తెలియక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏదో జరిగి ఉంటుందన్న ఆందోళనతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.