క్రీడాభూమి

త్రిపురపై జమ్మూ-కాశ్మీర్..భారీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తాలా: త్రిపురతో జరిగిన రంజీ మ్యాచ్‌లో జమ్మూ-కాశ్మీర్ 329 పరగుల తేడాతో భారీ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌ను దిగిన జమ్మూ-కాశ్మీర్ జట్టు 329 పరుగులకు ఆలౌ టైంది. అబిద్ ముస్తాక్ (76, నాటౌట్), జియాద్ మగ్రే (66) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం త్రిపుర తన తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మిలింద్ కుమార్ (55), ప్రత్యూష్ సింగ్ (47) మాత్రమే ఆకట్టుకున్నారు. జమ్మూ-కాశ్మీర్ కెప్టెన్ పర్వేజ్ రసూల్ 7 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 142 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జమ్మూ- కాశ్మీర్ 9 వికెట్లు కోల్పోయ 306 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొత్తం 448 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన త్రిపుర 119 పరుగులకే కుప్పకూలి, 329 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.