క్రీడాభూమి

ఐపిఎల్‌లో కోహ్లీ జీతం రూ.12.5 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంటులో ఆయా జట్లు కొనసాగిస్తున్న ఆటగాళ్లలో దక్కాల్సిన వేతనానికన్నా ఎక్కువ అందుకున్న కొద్ది మంది ఆటగాళ్లలో భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం ప్రకటించిన జాబితాలో ఈ వివరాలు తెలిసాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీ అసలు జీతం రూ 15 కోట్లు కాగా, కోతల తర్వాత అతని జీతం రూ. 12.5 కోట్లుగా ఉంది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహిందర్ సింగ్ ధోనీ వేతనం కూడా అంతే ఉంది.