జాతీయ వార్తలు

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్ల భారీ నష్టంతో ట్రేడయింది. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి కాస్త తేరుకున్నా నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 201 పాయింట్లు నష్టపోయి 26,525 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 8,141 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.22 వద్ద కొనసాగుతోంది.