జాతీయ వార్తలు

బిజెపి ఎంపీ గోయల్‌కు రూ.2 వేలు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధానిలో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు ఆప్ సర్కారు ప్రవేశపెట్టిన ‘సరి-బేసి’ విధానాన్ని అతిక్రమించినందుకు బిజెపి ఎంపీ విజయ్ గోయల్‌కు పోలీసుల రెండువేల రూపాయల జరిమానా విధించారు. సరి-బేసి నిబంధనలకు విరుద్ధంగా సోమవారం కారులో వెళుతున్న గోయల్నను ఆపి దిల్లీ రవాణామంత్రి గులాబీ పూలు ఇచ్చి నచ్చజెప్పారు. ఈ విధానానికి తాను వ్యతిరేకిని కానని, అయితే దిల్లీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటాన్ని నిరసిస్తూ తాను ఈరోజు కారును బయటికి తీశానని గోయల్ తెలిపారు. నిబంధనల్ని అతిక్రమించడంతో ఆయనకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. రెండు వేల రూపాయల జరిమానా మధ్యతరగతి వారికి మరీ భారంగా ఉందని ఆయన విమర్శించారు.