రంగారెడ్డి

వైభవంగా శివపార్వతుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 19: భక్తిశ్రద్ధలతో వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. బుధవారం షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ మూర్తులతో ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కౌన్సిలర్ అలోనిపల్లి శ్రీను, సింగిల్ విండో వైస్ చైర్మన్ పాండురంగా రెడ్డి, గజ్జెల వెంకట్ రెడ్డి, సంతోష్, బాల్‌రాజ్ గౌడ్, ఇస్నాగారి అంజయ్య, బాలాజీ, బుచ్చిరెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఫరూఖ్‌నగర్ మండలం ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. బుధవారం రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రుద్రాభిషేకం, నందిసేవ, అగ్నిగుండాలు నిర్వహించారు.
మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఫిబ్రవరి 20వ తేదిన ఏకాదశి రుద్రాభిషేకం, 21న మహా శివరాత్రి, 23న రుద్రహోమం, పూర్ణాహుతి, 25న శివతీర్థంతో ఉత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ ఎం.రవీందర్ రావు, వంశ పారంపర్య అర్చకులు కిరణ్ కుమార్, కార్యనిర్వహణాధికారి జే.శ్యాంసుందరాచారి, సర్పంచ్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.