రంగారెడ్డి

గండిమైసమ్మలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, అక్టోబర్ 13: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. పలు బస్తీలు జలమయమయ్యాయి. నియోజకవర్గంలోని గండిమైసమ్మ, దుందిగల్, గాగిల్లాపూర్, దొమ్మరపోచంపల్లి, కొంపల్లి, దూలపల్లి, బహద్దూర్‌పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, గాజులరామారం, సూరారం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గండిమైసమ్మలోని సాయిపూజ కాలనీ, డాక్టర్ బస్తీ, చంద్రశేఖర్ రెడ్డి నగర్ బస్తీలలో మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. సుమారు 15 ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జీడిమెట్ల డివిజన్ గోదావరి హోమ్స్, ఎన్‌సీఎల్ కాలనీ, గాయత్రి నగర్, శ్రీనివాస్ నగర్ కాలనీలు జలమయమయ్యాయి.
కేంద్ర మంత్రిని కలిసిన స్వామి
శంషాబాద్, అక్టోబర్ 13: ఈనెల 28న శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామ సమీపంలో చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో స్వామి వారి జన్మదిన వేడుకలు ఉన్నందున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ సీనియర్ నాయకుడు బుక్కవేణుగోపాల్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజీయర్ స్వామి కలిసి జన్మదిన వేడుకలకు రావాలని ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ ఉన్నారు.