జాతీయ వార్తలు
దిల్లీలో వేడుకగా గణతంత్ర దినోత్సవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 January 2016
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రాజ్పథ్లో జాతీయ జెండాను ఎగురవేసి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండె ముఖ్య అతిథిగా హాజరవడంతో అనూహ్య రీతిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. దివంగత లాన్స్ నాయక్ మోహన్దాస్ గోస్వామి భార్యకు ప్రణబ్ అశోకచక్ర పురస్కారం అందజేశారు. ప్రధాని మోదీ, ఉపరాష్టప్రతి అన్సారీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, త్రివిధ దళాల ప్రధానాధికారులు వేడుకలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు, విద్యార్థుల విన్యాసాలు ఆహూతులను అలరించాయి.