జాతీయ వార్తలు

శ్రీనగర్ చేరుకున్న హోం మంత్రి రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: శాంతి భద్రతల సమస్యతో సతమతమవుతున్న జమ్ము-కాశ్మీర్‌లో తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. భద్రతకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడతారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, గవర్నర్ నరేంద్రనాథ్ ఒహ్రాలతో ఆయన భేటీ అవుతారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్సాన్ వానిని భద్రతా దళాలు కాల్చిచంపిన అనంతరం గత కొద్దిరోజులుగా కాశ్మీర్‌లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.