జాతీయ వార్తలు

రెండోసారి బాధ్యతలకు రఘురాం రాజన్ నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రెండోసారి పదవిలో కొనసాగేందుకు తనకు ఇష్టం లేదని రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ శనివారం తన అంతరంగాన్ని బహిర్గతం చేశారు. ఆయన తీసుకున్న కీలక నిర్ణయం బ్యాంకింగ్ రంగంలో ఇపుడు చర్చనీయాంశమైంది. తన తర్వాత ఆర్‌బిఐ గవర్నర్‌గా వచ్చే వ్యక్తి మంచి ఫలితాలను సాధించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ నుంచి తప్పుకున్నాక ఈ ఏడాది సెప్టెంబర్ 4 తర్వాత తాను మళ్లీ బోధనా రంగంలో కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా, ఆర్‌బిఐ పదవి నుంచి రఘురాం రాజన్‌ను తప్పించాలని ఇటీవల బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి పదే పదే ప్రధానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోసారి బాధ్యతలు స్వీకరించలేనని రాజన్ తేల్చిచెప్పడం గమనార్హం.