జాతీయ వార్తలు

రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో అధికార పార్టీ మహిళా ఎంపీలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై రాహుల్ ఓ సభలో మాట్లాడుతూ మేకిన్ ఇండియా అత్యాచారాల రాజధానిగా మారిందని విమర్శించారు. ‘మేకిన్ ఇండియాను అత్యాచారాలతో ఓ రాజకీయ నాయకుడు పోల్చి మాట్లాడటం ఇంతవరకు జరుగలేదని, ఇది దేశాన్ని అవమానించటమేనని, ఇదేనా దేశ ప్రజలకు రాహుల్ ఇచ్చే సందేశం అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇతర పార్టీల మహిళా ఎంపీలు కూడా రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేయటం జరిగింది. రాజ్యసభలోనూ మహిళా ఎంపీలు ఆందోళన చేయటంతో సభలో లేని వ్యక్తి గురించి మాట్లాటం సరికాదని, సభకు ఆటంకం కలిగించ వద్దని సభను మధ్యాహ్నాం వరకు వాయిదా వేశారు.