జాతీయ వార్తలు
పంజాబ్లో రాష్టప్రతి పాలన విధించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 June 2016
చండీగఢ్: హింసాత్మక సంఘటనలతో అరాచకత్వం పెచ్చుమీరుతున్నందున పంజాబ్లో తక్షణమే రాష్టప్రతి పాలన విధించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్ సింగ్ సోమవారం డిమాండ్ చేశారు. ఇటీవలి విధ్వంసకాండలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లూధియానాలో గత నెల 17న జరిగిన దాడుల్లో మరణించిన భూపేందర్సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అరాచక శక్తుల విధ్వంసానికి సిఎం ప్రకాష్సింగ్ బాదల్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.