జాతీయ వార్తలు

దేశ సేవకు ఇందిరను అనుసరిస్తా:ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: తనను ఇందిరాగాంధీతో పోల్చవద్దని, కాని దేశానిక సేవ చేసే విషయంలో ఆమె అడుగుజాడల్లో నడుస్తానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాందీకి దేశ సేవపట్ల ఎంతో అంకితభావం ఉందని, అలాంటి అంకితభావమే తనకు, తన సోదరుడు రాహుల్‌కి గుండెల్లో ఉందని అన్నారు మోదీ ఒక అసమర్థ ప్రధాని అన్నారు. కాన్పూర్‌ను స్మార్ట్‌సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. బీజీపీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. న్యాయ్ పథకానికి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని బీజేపీ ప్రశ్నిస్తుందని, బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టటానికి నిధులు వారికి వస్తాయని అన్నారు.