జాతీయ వార్తలు
సోనియా, మన్మోహన్లపై సుప్రీంలో ‘పిల్’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 April 2016
దిల్లీ: అగస్టా-వెస్ట్ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో భారీగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చినందున కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఓ న్యాయవాది గురువారం నాడు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసినట్టు కోర్టు ప్రకటించింది. హెలికాప్టర్ల కొనుగోలులో 3,600 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందని ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పులో సోనియా ప్రభృతుల పేర్లను ప్రస్తావించినందున వారిపై కేసు నమోదు చేయాలని ఆ న్యాయవాది కోరారు.