జాతీయ వార్తలు

తమిళనాడులో రూ. 765 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ముగుస్తుండగా ఎన్నికల అధికారులు శనివారం దాడులు నిర్వహించి 765 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లలో తరలిస్తుండగా ఈ నగదును పట్టుకున్నారు. అయితే, ఇది ఎస్‌బిఐకి చెందిన డబ్బు అని పట్టుపడిన వారు చెబుతున్నారు. తిర్పూరు వద్ద 3 కంటైనర్లలో 570 కోట్లు, కోయంబత్తూరు వద్ద 2 కంటైనర్లలో 195 కోట్లను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. విచారణలో ఇది ఎస్‌బిఐ డబ్బు అని తేలితే ఆ బ్యాంకుకు అప్పచెబుతామని ఎన్నికల అధికారులు తెలిపారు.