జాతీయ వార్తలు

కార్మికులే ప్రగతి సారథులు: దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: కార్మికులు లేకుండా పురోగతి సాధించలేమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురష్కరించుకొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ‘‘శ్రమయేవ జయతే’’ నినాదం ద్యారా ప్రతి కార్మికుడికి న్యాయబద్ధమైన వ్యవస్థను సృష్టిస్తూ ఉత్తమ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కార్మిక మంత్రిగా ఇప్పటి వరకూ తను తీసుకున్న కీలక నిర్ణయాలు వివరించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ఒక ఉద్యోగి ఒకే ఈపీఎఫ్ అకౌంట్ నెంబరు ఉండే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఢిల్లీలోని ఈపీఎఫ్‌ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన సామాజిక భద్రత బలోపేతం చేయడానికే ఈపీఎఫ్ ఉద్యోగులకు ఒకే అకౌంట్ నెంబరు అందిస్తున్నట్టు తెలిపారు. వేర్వేరు పీఎఫ్ నంబర్లు ఉండటం వల్ల క్లెయిమ్ చేసుకోనే సమయంలో ఉద్యోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.