జాతీయ వార్తలు

కాంగ్రెస్ ర్యాలీలో ‘పాక్ జిందాబాద్’ నినాదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొరాదాబాద్, సెప్టెంబర్ 27: ఓ పక్క కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని యావద్భారతం ముక్తకంఠంతో ఖండిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు జరిగినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న కొందరు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినట్టుగా సమాచార్ ప్లస్ అనే వార్తా చానల్ ప్రసారం చేసింది. ఉరీ ఆర్మీ శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. మరణించిన సైనికులకు నివాళులర్పించేందుకు జరిగిన ఈ ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు వినిపించడం సర్వత్రా దిగ్భ్రాంతి రేకెత్తిస్తోంది.