జాతీయ వార్తలు

పోలవరం అంచనాలు సవరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: పోలవరం ప్రాజ్టెకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో అంచనాలను సవరించాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రితో ప్రత్యేకంగా భేటి అయ్యారు. 2016 సంవత్సరం అంచనాల ప్రకారం దాదాపు ప్రాజెక్టు 26 వేల కోట్లు అవుతుందని, ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరిపోదని కేంద్రమంత్రికి వివరించారు. అలాగే బుధవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన అంశాలపై కూడా చంద్రబాబు ఆమెతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అపెక్స్‌కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలపై కూడా చంద్రబాబు ఉమాభారతితో చర్చించారు.
chitram....
బుధవారం ఢిల్లీలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశానికి కేంద్రమంత్రి ఉమాభారతితో కలిసి తరలివస్తున్న టి.సిఎం కెసిఆర్,
ఏపి సిఎం చంద్రబాబు