జాతీయ వార్తలు

సిసోడియాపై సిరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సోమవారం ఓ వ్యక్తి ఇంకు జల్లాడు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వెలుపలే ఈ ఘటన చోటుచేసుకుంది. జనం వివిధ వ్యాధులతో బాధపడతుంటే పట్టించుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్తారా అంటూ ఆగ్రహంతో అతడు ఈ చర్యలు పాల్పడ్డాడు. మంత్రి కారు ఎక్కుతుండగా బ్రిజేష్ శుక్లా అనే ఢిల్లీ వాసి ఇంకు వేశాడు. సిసోడియా చేతులు, నుదిటపై సిరా పడింది. ఇంకు దాడిపై ఉప ముఖ్యమంత్రి తీవ్రంగానే స్పందించారు. ‘కాంగ్రెస్, బిజెపి నీచరాజకీయాలకు పాల్పడుతున్నాయి’ అని ఆయన మండిపడ్డారు. సిరా దాడికి దిగిన శుక్లా వాయువ్య ఢిల్లీలోని కరావాల్ నగర్‌కు చెందినవాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఢిల్లీ ప్రజలు డెంగ్యూ, చికున్ గునియాలతో బాధపడుతుంటే సిసోడియా ఫిన్‌లాండ్ షికారుకు వెళ్లారని శుక్లా ఆరోపించాడు. అందుకే తాను ఇంకు జల్లానని విచారణలో వెల్లడించాడు. రాజధానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి లెఫ్టినెంట్ గవర్నరను కలవడానికి వచ్చారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు ఆప్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపి నీచరాజకీయాలు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.