జాతీయ వార్తలు

రూ.వంద, బిర్యానికోసం.. 42 బస్సుల దగ్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 19: ఎవరికయినా వంద రూపాయలు ఇచ్చి, ఒక ప్లేట్ మటన్ బిర్యాని తినిపిస్తామంటే 42 బస్సులను దగ్ధం చేస్తారా? దీనికి సమాధానం అవును అని వస్తే, ఈ దహనకాండకు పాల్పడింది ఓ యువతి అని తెలిస్తే ఇంకెంతో ఆశ్చర్యంగా, ఒళ్లు జలదరించేలా ఉంటుంది! కర్ణాటకలో తలెత్తిన హింసాకాండలో భాగంగా ఈ చేదు సంఘటన జరిగింది. డిసౌజా నగరంలో ఈ నెల 12న తమిళనాడుకు చెందిన ప్రైవేటు రవాణా సంస్థ కెపిఎన్‌కు చెందిన వాహనాలను దగ్ధం చేసిన కేసులో పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసిన 11మందిలో ఉత్తర కర్ణాటకలోని యాదగిర్ జిల్లాకు చెందిన సి.్భగ్య అలియాస్ భాగ్యశ్రీ ఒకరు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన 42 వాహనాలను దగ్ధం చేయడానికి ఆందోళనకారులను పురికొల్పడంతోపాటు ఆ దహనకాండలో ఆమె స్వయంగా పాల్గొన్నదని ఒక ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది. ‘మధ్యాహ్నం (సెప్టెంబర్ 12న) నా కుమార్తె ఇంటికి వచ్చింది. ఆమెకు తెలిసిన వ్యక్తులు కొంతమంది మా ఇంటికి వచ్చి ఆమెను ఆందోళనలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఆందోళన ముగిశాక రూ.వందతో పాటు ఒక ప్లేట్ బిర్యాని ఇస్తామని వారు హామీ ఇచ్చారు’ అని భాగ్య తల్లి చెప్పారు.