జాతీయ వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం .. పది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, జూలై 24: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి-బెంగళూరు జాతీయ రహదారిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరం చెందగా 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే కృష్ణగిరి-బెంగళూరు జాతీయ రహదారిలోని శూలగిరి గ్రామ సమీపంలో హోసూరు నుంచి కృష్ణగిరి వైపు వస్తున్న శ్రీదేవి ప్రైవేటు బస్సు, కృష్ణగిరి నుంచి హోసూరు వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొనడంతో బస్సు సగభాగం నుజ్జునుజ్జయింది. దీంతో ఎనిమిది మంది అక్కడకక్కడే మృతి చెందగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యంలో మృతి చెందారు. 28 మంది హోసూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని హోసూరు పోలీసులు పేర్కొంటున్నారు. క్షతగాత్రులో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీరిలో కూడా మరికొంతమంది చనిపోయే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

కృష్ణగిరి-బెంగళూరు రహదారి శూలగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దృశ్యం