జాతీయ వార్తలు

రాహుల్ గాంధీతో ఏపి కాంగ్రెస్ నేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా ప్రజల సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీ తన నివాసంలో ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై జరిగిన పరిణామాలను రఘువీరారెడ్డి తదితర నాయకులు రాహుల్ గాంధీకి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై వారు రాహుల్‌తో చర్చించారు. ప్రజా సమస్యలపై ఎపి కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అండగా ఉంటుందని వారికి రాహుల్ చెప్పారు. విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆగస్టులో రాహుల్ గాంధీ ఎపి పర్యటనకు వస్తారని పార్టీ నాయకులు వెల్లడించారు. రాహుల్‌ను కలిసిన వారిలో జెడి శీలం, పళ్లంరాజు, బాపిరాజు, సి.రామచంద్రయ్య, కెవిపి తదితరులు ఉన్నారు.