జాతీయ వార్తలు

ఏపి భవన్ ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: న్యూఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో ఉద్యోగుల పనిదినాలను వారానికి ఐదు రోజులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వుల ప్రకారం ఏపీ భవన్ ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిని సవరించి ప్రభుత్వం పై ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చిన వెసులుబాటును ఆంధ్రా భవన్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఏపి భవన్ ఉద్యోగుల విధినిర్వహణా సమయంలో మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.