జాతీయ వార్తలు

కర్నూలు, నెల్లూరులో క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌సిఐ), నెల్లూరులో క్యాన్సర్ తృతీయ చికిత్స కేంద్రం (టిసిసిసి) ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపాలని ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లేఖ రాసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజప్తిమేరకు క్యాన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి శుక్రవారం కేంద్ర మంత్రి జెపి నడ్డా వెంకయ్యనాయుడుకి సమాచారం ఇచ్చారు. మరోవైపు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో శుక్రవారం సమావేశం అయ్యారు. పౌరవిమానయానానికి సంబందించిన పలు అంశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, వెంకయ్యనాయుడు వివరించారు.