జాతీయ వార్తలు

బంగ్లాదేశ్‌లో హిందూ పూజారి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూన్ 7: బంగ్లాదేశ్‌లో మంగళవారం 70 ఏళ్ల హిందూ పూజారిని ఇస్లామిక్ స్టేట్ జిహాదీలుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది హత్యకు గురయిన హిందూపూజారుల్లో ఈయన రెండో వ్యక్తి. జినాయిగా జిల్లాలోని నోల్‌దంగా గ్రామంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మోటారు బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పూజారి ఆనంద్ గోపాల్ గంగూలీపై దాడి చేసి ఆయన గొంతు కోసి చంపేశారని పోలీసు అసిస్టెంట్ సూపరింటెండెంట్ (ఎసిపి) గోపీనాథ్ కంజీలాల్ చెప్పారు. మిలిటెంట్లే ఈ హత్య చేసి ఉంటారనిపిస్తోందని, ఎందుకంటే గతంలో పూజారి హత్య జరిగిన తీరులోనే ఇది కూడా జరిగిందని జిల్లా ఎస్‌పి అల్త్ఫా హుస్సేన్ చెప్పారు. గంగూలీ వయోవృద్ధుడే కాక ఇరుగుపొరుగు వాళ్లకు తప్ప మిగతా వారికి పెద్దగా తెలియని సాధారణ వ్యక్తి అని, ఆయను ఎవరితోనైనా శత్రుత్వం ఉన్నట్లు కూడా అనిపించడం లేదని, అందువల్ల మిలిటెంట్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నామని ఎస్పీ చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించినట్లు పోలీసులు చెప్పారు. దాదాపు కుళ్లిపోయిన పరిస్థితిలో ఉన్న పూజారి మృత దేహాన్ని ఆయన నివాసానికి సమీపంలోని పొలంలో రైతులు గుర్తించారు. కాగా, పూజారిని తామే హత్య చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ తన వార్తాసంస్థ ‘అమక్’లో చెప్పుకొంది.
సదర్ ఉపాలిజాలోని నల్‌దంగా ఆలయం పూజారి అయిన గంగూలీ పూజ చేయడం కోసం సైకిల్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. మొదట ఆయనపై కాల్పులు జరిపిన వారు ఆ తర్వాత అతని మెడ నరికేశారు. ఇదిలా ఉండగా దేశంలో ఇటీవల వరసగా మిలిటెంట్ల దాడులు జరిగిన తర్వాత ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున దాడులకు దిగిన బంగ్లాదేశ్ పోలీసులు నిషేధిత జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్‌కి చెందిన ముగ్గురు మిలిటెంట్లను మంగళవారం కాల్చి చంపారు. గత ఆదివారం మిలిటెంట్లు పోలీసు సూపరింటెండ్ బబూల్ అఖ్తార్ భార్యను దారుణంగా హత్య చేసిన కొద్ది గంటలకే ఒక క్రైస్తవ వ్యాపారిని నరికి చంపేయడం తెలిసిందే.