జాతీయ వార్తలు

మీ బెదిరింపులకు భయపడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, మే 27: తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే సిబిఐను కేంద్రం ఉసిగొల్పుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ధ్వజమెత్తారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి భంగపడ్డ ఎన్‌డిఏ ప్రభుత్వం సిబిఐను పావుగా వాడుకుంటోందని శుక్రవారం ఇక్కడ విరుచుకుపడ్డారు.‘బిజెపి, నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం సిబిఐని వాడుకుంటోంది. ఈ కుట్రలను ఎలాతిప్పికొట్టాలో మాకు తెలుసు’అని రావత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన రావత్ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.‘నేను జైలుకెళ్లడానికి సైతం వెనుకాడను. కేంద్రంపై పోరాడతాను. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకూ ననే్నమీ చేయలేరు’అని రావత్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీపడబోనని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. బిజెపి కుట్రలను ప్రచారం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రావత్ పిలుపునిచ్చారు. బిజెపికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ అంటే విశ్వాసం లేదని ఆయన విమర్శించారు.‘దర్యాప్తులకు మేం భయపడం. బిజెపి కుట్రలను తిప్పికొట్టే సత్తా మాకుంది’అని ఆయన ప్రకటించారు.