జాతీయ వార్తలు

మిలిటెంట్ల చొరబాటు భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 23: ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటును శనివారం ఆర్మీ భగ్నం చేసింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు వీరమరణం పొందాడు. శుక్రవారం అర్ధరాత్రి పిఓకే నుంచి కొంతమంది భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. పహరా కాస్తున్న భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని, కొంత సేపటి తరువాత ఉగ్రవాదులు పారిపోయారని ఒక సైనికాధికారి శనివారం చెప్పారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడని, దురదృష్టవశాత్తు అతను తరువాత మృతి చెందాడని ఆ అధికారి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన కొద్దిసేపటికే పారిపోయిన ఉగ్రవాదులకోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు ఆయన వివరించారు.