జాతీయ వార్తలు

ఓటరుకు మరింత చేరువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: హిందీ రాష్ట్రాల్లోని ఓటర్లకు చేరువ కావాలన్న లక్ష్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల బస్సు యాత్రను శనివారం నుంచి చేపట్టబోతోంది. ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు జరిగే ఈ యాత్రలో ‘27సాల్ యూపి బేహాల్’ (27ఏళ్లలో ఉత్తరప్రదేశ్ సర్వ నాశనమైంది) అనే నినాదాన్ని ప్రచారంలోకి తీసుకురావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ యాత్రను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. మరికొన్ని నెలల వ్యవధిలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక రీతిలో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ నెల 29న లక్నోలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టామని, అందులో రాహుల్ గాంధీతోపాటు పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొంటారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథి సంజయ్ సింగ్ వెల్లడించారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ, బిజెపిల వైఫల్యాలను ఎండగట్టడమే ఈ యాత్ర లక్ష్యమని, గత 27 సంవత్సరాలుగా రాష్ట్ర పరిస్థితి ఎంతగా దిగజారిందో ప్రజల కళ్లకు కడతామని ఆయన తెలిపారు. ప్రతి ఓటరును కనీసం మూడు నుంచి నాలుగుసార్లు కలుసుకునే విధంగా ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.
ఈ యాత్రలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారా అన్న ప్రశ్నకు ‘గత కొంతకాలంగా ప్రియాంక రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఈసారి మా డిమాండ్ ఆమె అంగీకరిస్తుందన్న నమ్మకం ఉంది’ అని వెల్లడించారు.