జాతీయ వార్తలు

జవాబులేం చెప్పాలో ‘బోధించారు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబై జూన్ 16: ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ వివాదం మరోసారి రాజుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అదృశ్యమైన కొన్ని ఫైళ్లపై జరుగుతున్న విచారణలో జవాబులివ్వాల్సిన ముఖ్యమైన సాక్షి ఏ విధంగా మాట్లాడాలో ఓ అధికారి అతనికి బోధన చేశారంటూ వచ్చిన వార్తలు వివాదాస్పదమయ్యాయి. మోదీ ప్రభుత్వం అబద్ధపు వివాదాన్ని సృష్టిస్తోందని ఈ విషయాన్ని సుప్రీం కోర్టు సూమోటోగా విచారణకు స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ గురువారం డిమాండ్ చేసింది. అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రిషి మాత్రం తమ శాఖపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తమ శాఖలో ఏ ఒక్క అధికారి కూడా ఎవరికీ ఎలాంటి ‘బోధన’లు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.