జాతీయ వార్తలు
సత్సంబంధాలే లక్ష్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 June 2016
న్యూఢిల్లీ, జూన్ 12: ఆఫ్రికా దేశాలైన ఘన, ఐవరీ కోస్ట్, నమీబియాలలో ఆరు రోజుల పాటు పర్యటించేందుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం బయలుదేరారు. బలమైన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య పునాదులు కలిగిన ఈ మూడు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడమే ధ్యేయంగా ప్రణబ్ ఈ పర్యటన చేపట్టారు. ఘన, ఐవరీకోస్ట్లలో భారత రాష్టప్రతి పర్యటించడం ఇదే మొదటిసారి. నమీబియాలో రెండు దశాబ్దాల తర్వాత భారత రాష్టప్రతి పర్యటన జరపడం తొలిసారి. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ ప్రభృతులు రాష్టప్రతికి వీడ్కోలు పలికారు.
చిత్రం ఆఫ్రికా దేశాల పర్యటనకు బయలుదేరుతున్న రాష్టప్రతికి పుష్పగుచ్ఛమిచ్చి వీడ్కోలు పలుకుతున్న ప్రధాని నరేంద్ర మోదీ