జాతీయ వార్తలు

వీధి పిల్లలపై వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: వీధి పిల్లలను అనుమతించని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌పై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగుతోంది. తన భర్త పుట్టినరోజు సందర్భంగా కొందరు వీధి పిల్లలకు కన్నాట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్‌లో భోజనం పెట్టించాలని భావించిన రచయిత్రి సోనాలి శెట్టి ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వీధి పిల్లల పట్ల వివక్ష అంటూ హోటల్ ముందే ధర్నాకు దిగారు. ఆదివారం కూడా ఈ ధర్నాను కొనసాగించటంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ పిల్లలకు భోజనం పెట్టడానికి నిరాకరించిన ఆ రెస్టారెంట్ యాజమాన్యం తనను కూడా అవహేళన చేసిందని, వెళ్లిపొమ్మని బెదిరించిందని ఆమె ఆరోపించారు. రంగంలోకి దిగిన ఢిల్లీ ప్రభుత్వం మెజిస్ట్రేట్ దర్యాప్తుకు ఆదేశించింది. పిల్లలకు భోజనం పెట్టకపోవటం నిజమని తేలితే ఆ రెస్టారెంట్ లైసెన్స్‌ను రద్దు చేస్తామనీ హెచ్చరించింది.

చిత్రం ఆదివారం ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఢిల్లీ వీధి పిల్లలు