జాతీయ వార్తలు

ఏం సాధించారని ఈ సంబరాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబై, మే 28: మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దేశమంతటా రైతులు కరవుతో అల్లాడుతుంటే ఇండియాగేట్ దగ్గర మోదీ సర్కారు పండుగ చేసుకుంటోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో విమర్శించారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి ఆగిపోయిందని.. దేశం దుర్భర పరిస్థితిలోకి వెళ్లిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. మోదీ సర్కారు పనితీరుపై 59పేజీల బుక్‌లెట్‌ను కాంగ్రెస్ పార్టీ శనివారం దేశమంతటా విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల రాజధానుల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకం నిజానికి నిలువుటద్దం అని ఆ పార్టీ తన బుక్‌లెట్‌లో స్పష్టం చేసింది. ముంబైలో కపిల్ సిబల్ ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు.