జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు చెంపపెట్టు : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: భాజపాకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా పార్లమెంటును సజావుగా సాగనివ్వకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అసహన రాజకీయాలకు చెంపపెట్టని, కాంగ్రెస్, వామపక్షాల అపవిత్ర కలయిక, అవకాశవాద పొత్తులను ప్రజలు నిరాకరించారన్నారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, తాత్కాలిక ప్రజాకర్షక పథకాలు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేయలేవని ఈ ఫలితాలు నిరూపించాయన్నారు.