జాతీయ వార్తలు

అభివృద్ధి సిద్ధాంతానికి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: అసోంలో బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ప్రజానీకానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అభివృద్ధి సిద్ధాంతానికి అసోం ప్రజలు మద్దతు పలకడం కొత్త ఉత్సాహాన్ని అందించిందని అయన వ్యాఖ్యానించారు. ఈశాన్య భారతంలో మొట్టమొదటిసారి పార్టీ అధికారంలోకి రావటం బీజేపీకి పెరుగుతున్న ప్రజల మద్దతుకు సంకేతమని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం పార్టీ పార్లమెంటరీబోర్డు సమావేశంలో పాల్గొనడానికి ముందు పార్టీ కార్యకర్తలతో కాసేపు మాట్లాడిన మోదీ, జమ్ముకశ్మీర్‌లో ప్రజల మద్దతు సంపాదించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారని.. ఇప్పుడు అసోం ప్రజలు కూడా ఆశీర్వదించటం తమకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చినట్లయిందని ఆయన అన్నారు. సామాన్య ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పును తీసుకురావటం కోసం విశ్రాంతి లేకుండా చేస్తున్న తమ ప్రయత్నాలకు ప్రజల ఆమోదం లభించినట్లయిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బీజేపీ ప్రజల మద్దతును వేగంగా పొందుతోందన్నారు. అంతకుముందు అస్సాంలో ముఖ్యమంత్రి అభ్యర్థి శర్వానంద్ సోనోవాల్‌తో పాటు తమిళనాడులలో రెండోసారి అధికారాన్ని సాధించిన జయలలిత, మమత బెనర్జీలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.