జాతీయ వార్తలు
నేను కాల్పులు జరపలేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://ftp.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/11m1.jpg?itok=ZUvXZB36)
గయ, మే 10: బిహార్లోని గయ జిల్లాలో రెండు రోజుల క్రితం తన వాహనాన్ని ఓవర్టేక్ చేసినందుకు 20 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపాడన్న ఆరోపణపై అరెస్టయిన జెడి(యు) ఎమ్మెల్సీ కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ మాత్రం తాను ఆ యువకుడిపై కాల్పులు జరపలేదని, అసలు ఆ సంఘటన జరిగిన సమయంలో తాను ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులనుంచి దాక్కోవడానికి కారణమేమిటని అడగ్గా, తాను ఎక్కడ దాక్కున్నానని ఎదురు ప్రశ్నించిన రాకీ కోర్టులో తన జవాబు చెప్తానని చెప్పాడు. కాగా, రాకీ పోలీసుల వద్ద తన నేరాన్ని అంగీకరించినట్లు మరో కథనం పేర్కొంది. ఈ హత్యతో సంబంధించిన మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఓ పోలీసు అధికారి చెప్పారు. పోలీసులు గయలో అనేకచోట్ల దాడులు జరిపిన అనంతరం మంగళవారం తెల్లవారుజామున పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోని బోధ్గయలో ఉన్న హాట్మిక్స్ ప్లాంట్లో రాకీని అరెస్టు చేశారు. అతని వద్దనుంచి నేరంలో ఉపయోగించిన విదేశీ తయారీ రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు గయ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ గరిమా మాలిక్ మీడియాకు చెప్పారు.
chitram కారును ఓవర్టేక్ చేయడంతో ఆగ్రహించి ఒక యువకుడి కాల్చి చంపిన కేసులో మంగళవారం అరెస్టయన రాకీ యాదవ్. రాకీ జెడి(యు) ఎమ్మెల్సీ మనోరమ కుమారుడు.